తెలంగాణలో నిన్న 31,486 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,92,128కి చేరింది. ఇందులో 4,005 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 2,86,542 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజాగా ఇద్దరు మృతిచెందగా, మొత్తం 1,581 కరోనా మరణాలుసంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 75,15,066 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.