తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. ప్రముఖ సినీ నటుడు మోహన్బాబుకు జీహెచ్ఎంసీ రూ.లక్ష జరిమానా విధించింది. జూబ్లీహిల్స్ ఫిల్మ్నగర్ రోడ్ నంబర్ 1లోని ప్లాట్ నంబర్ 6 వద్ద మోహన్బాబు ఇంటి ఆవరణలో అనుమతి లేకుండా 15 అడుగుల ఎత్తున్న వాణిజ్య ప్రకటన బోర్డు ఏర్పాటుచేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో జీహెచ్ఎంసీ.. చలాన్ వేసింది.
