చదవడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇదే నిజం. పై చిత్రంలో కన్పిస్తున్న మహిళ పేరు రమ. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం తడ్కల్ నుంచి ఇద్దరు పిల్లలతో కల్సి ఆమె కుటుంబం హైదరాబాద్ మహానగరానికి వలస వచ్చారు. నగరంలోని అంబర్ పేటలో ఉంటోంది. రమ భర్త రమేష్ చెప్పులు కుట్టడం ద్వారా వచ్చే కొద్దిపాటిసంపాదనతో జీవన గడుపుతూ ఉండేవారు.
అయితే కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను ఆగం చేసినట్లు కరోనా లాక్ డౌన్ తర్వాత వీరి జీవితాలను ఆయోమయానికి గురిచేసింది.. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. గతంలో మాదిరిగా ప్రస్తుతం పని దొరక్కపోవడంతో ఇంటి అద్దె కట్టడమే కష్టతరమైంది.
దీంతో ఇంటర్ చదివిన రమ కూడా పనిచేయక తప్పలేదు. భర్త రమేష్ తాను బర్కత్ పురలో రోడ్డు పక్కన చెప్పులు కుట్టే పనిని రమకు అప్పజెప్పి మరో పనికి కుదిరాడు. వారి పిల్లలో ఒకరు మూడో తరగతి.. ఇంకోకరుఐదో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ప్రస్తుతం బడులు లేకపోవడంతో ఇంటర్ వరకు చదివి ఉన్న రమ తన పిల్లలకు పాఠాలు చెబుతుంది. ఇదే ఓ అమ్మ కథ.