తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 74,274 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,914 మందికి పాజిటివ్గా తేలింది. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఐదుగురు మృతిచెందగా, మొత్తం మరణాల సంఖ్య 1,734కు చేరుకున్నది. 11,617 మంది దవాఖానలు, హోంఐసొలేషన్లో చికిత్స పొందుతున్నట్టు బుధవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది.
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 393, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 205 వెలుగుచూశాయి. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, 45 ఏండ్లు దాటినవారు వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ విజ్ఞప్తిచేసింది.
ఇతర సమాచారం, టెలిమెడిసిన్, అనుమానాల నివృత్తికి 104కు ఫోన్చేయాలని, ప్రైవేట్ దవాఖానలు, ల్యాబ్ల విషయాలు, ఫిర్యాదుల కోసం 9154170960 నంబర్కు వాట్సాప్చేయాలని పేర్కొన్నది. ఏపీలోనూ వైరస్ విజృంభిస్తున్నది. మంగళవారం 31,812 నమూనాలను పరీక్షించగా, 2,331 మందికి నిర్ధారణ అయ్యింది. 11 మంది మృత్యువాతపడ్డారు.