తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు వ్యాక్సినేషన్ నిలిపివేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. సోమవారం నుంచి యథాతథంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
వ్యాక్సినేషన్ నిల్వలు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుండగా.. ప్రజలెవరూ వ్యాక్సినేషన్ కేంద్రాలకు రేపు రావొద్దని ప్రభుత్వం సూచించింది.