కింగ్ నాగార్జున నటిస్తున్న సినిమాలో బుల్లితెర హాట్ యాంకర్..హీరోయిన్ రష్మీ గౌతమ్ నటించే అవకాశం దక్కించుకుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ‘వైల్డ్ డాగ్’తో వచ్చిన నాగార్జున సూపర్ హిట్ అందుకున్నాడు.
ఆయన నెక్స్ట్ సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ మొదలై కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. త్వరలో మళ్ళీ సెట్స్ మీదకు రానున్న ఇందులో యాంకర్గా క్రేజ్ ఉన్న రష్మీ గౌతమ్ కీలక పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది.
ఇంతకముందు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ‘గుంటూరు టాకీస్’ సినిమాలో హీరోయిన్గా నటించింది. మరోసారి ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం అంటే రష్మీకి ఖచ్చితంగా పేరొచ్చే పాత్రే అని టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. నాగార్జున సినిమాలలో యాంకర్స్ నటించడం కొత్తేమీ కాదు. ఇంతక ముందు ఆయన నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో అనసూయ నటించిన సంగతి తెలిసిందే.