తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అందాల రాక్షసి రష్మిక మంధాన ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. అయితే ప్రపంచాన్ని ఆగం చేస్తున్న కరోనా మహమ్మారి వలన ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.
ప్రస్తుతం కరోనా పరిస్థితులు మెరుగుపడుతుండటంతో ఈ మూవీ షూటింగ్ పునర్ ప్రారంభం కానున్నట్లు ఆ చిత్రం యూనిట్ తెలిపింది. చిత్రీకరణలో భాగంగా కొన్ని రోజులు హైదరాబాద్ మహనగరంలో షూటింగ్ జరుపుకోనున్నది.
ఆ తర్వాత షూటింగ్ కోసం గోవా వెళ్లనున్నారు అని సమాచారం. గోవాలో హీరో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక మంధాన పై రోమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరణ జరగనున్నట్లు తెల్సింది. దాదాపు పదిహేను రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది.దీంతో ఈ చిత్రం షూటింగ్ పూర్తవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు.