Home / SLIDER / మంత్రి కేటీఆర్ గారితో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భేటీ

మంత్రి కేటీఆర్ గారితో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భేటీ

హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో మంత్రి శ్రీ కేటీఆర్ గారితో నర్సంపేట అభివృద్దిపై ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి బేటీ అయ్యారు..నర్సంపేట అభివృద్ది,చేపట్టవలసిన పనులు,పెండింగ్ పనుల పూర్తిపై మంత్రి కేటీఆర్ తో ఎమ్మెల్యే చర్చించారు..నర్సంపేట పట్టణాభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని,కొత్తపనుల మంజూరీ చేయడంతో పాటు పెండింగ్ పనుల పూర్తికి సహాకారం అందించాలని కోరారు..- నర్సంపేట నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ స్పెషల్ ఎకనామికల్ జోన్ ఏర్పాటు చేయాలని కోరారు..
– నర్సంపేట నుండి వరంగల్ వరకు ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని,తద్వారా నర్సంపేటకు ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంటుందని కేటీఆర్ గారిని ఎమ్మెల్యే కోరారు..

– మాదన్నపేట మిని ట్యాంక్ బండ్ నిర్మాణం పూర్తికి మరో 5 కోట్ల రూపాయల నిదులు మంజూరు చేయాలని కోరారు..- నర్సంపేట పట్టణానికి ప్రయాణానికి సౌకర్యార్థమై రింగురోడ్డు పూర్తి కోసం మరో 15 కిలోమీటర్లు రోడ్డు కావాలని కోరారు..- నర్సంపేట మోడల్ సిటీ ప్లాన్ లో బాగంగా 100% రోడ్ల నిర్మాణం చేపట్టుటకు గాను 15 కోట్ల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసారు..- నర్సంపేట పట్టణంలో గత మూడేళ్ళలో జరిగిన అభివృద్ది పై ప్రత్యేక సమీక్ష సమావేశం అదికారికంగా నిర్వహించి మిగిలిన పనుల వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంత్రిని కోరారు..

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ తన నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపాదించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు తమ శాఖ తరఫున పూర్తి మద్దతు ఇస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కోరినట్లు త్వరలోనే నర్సంపేట పట్టణానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని నిర్వహించి… అక్కడ జరిగిన అభివృద్ధి ప్రస్థానానికి మరింత అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే పట్టణానికి సంబంధించి అనుమతి లభించిన కార్యక్రమాలు, పనుల పురోగతి మరింత వేగవంతం అయ్యేలా మున్సిపల్ శాఖ అధికారులకు సూచిస్తానని తెలిపారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat