Home / SLIDER / వెనక్కి తగ్గిన బండి సంజయ్

వెనక్కి తగ్గిన బండి సంజయ్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయుదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 9 నుంచి పాదయాత్ర చేయబోతున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది.

దీంతో జాతీయ పార్టీ ప్రత్యేక అనుమతి ఇస్తేనే షెడ్యూల్ ప్రకారం పాదయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.  మరోవైపు పార్లమెంట్ సమావేశాల తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పర్యటన చేసేందుకు సిద్ధమవుతున్నారు.

సొంత నియోజకవర్గానికి కాకుండా ఇతర పార్లమెంట్ సెగ్మెంట్లకు మొదటగా వెళ్ళాలని కేంద్రమంత్రులకు కాషాయపార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి నేరుగా తిరుపతి, విజయవాడ, భద్రాచలం పర్యటనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెళ్లనున్నారు. దీంతో  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat