దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 25,166 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 154 రోజుల తర్వాత అతి తక్కువగా కేసులు రికార్డయ్యాయని పేర్కొంది.
తాజాగా 36,830 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో మరో 437 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,50,679కు పెరిగింది. ఇందులో 3,14,48,754 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 4,32,079 మంది ప్రాణాలు వదిలారు.
ప్రస్తుతం దేశంలో 3,69,846కి తగ్గి.. 146 రోజుల కష్ఠానికి చేరుకున్నాయని చెప్పింది. దేశంలో రికవరీ 97.51 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం వీక్లీ పాజిటివిటీ రేటు 1.98శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 1.61శాతంగా ఉందని తెలిపింది.
గత 24గంటల్లో 88.13లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒకే రోజు ఇదేస్థాయిలో టీకాలు వేయడం తొలిసారని చెప్పింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 55.47పైగా డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. అలాగే మహమ్మారి మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 49.66 కోట్ల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది.