తాప్సీ మరో లేడీ ఓరియెంటెడ్ మూవీతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. అయితే, ఈ సారి నేరుగా ఓటీటీకి వచ్చేస్తోంది ఢిల్లీ బేబీ. ‘రశ్మీ రాకెట్’ సినిమా డిజిటల్ రిలీజ్కి సర్వం సిద్ధమైంది. స్పోర్ట్స్ డ్రామాగా జనం ముందుకొస్తోన్న ఈ సినిమాపై అప్పుడే ఆన్లైన్లో ట్రోలింగ్ కూడా ఊపందుకుంది. ముఖ్యంగా, తాప్సీ న్యూ లుక్ కొందరి కామెంట్లకు కారణం అవుతోంది. అథ్లెట్గా కనిపించేందుకు ఆమె తీవ్రంగా శ్రమించింది. వ్యాయామాలు చేసి సూపర్ ఫిట్గా మారింది. కానీ, ఇప్పుడు అదే కొందరి కామెడీలకు కారణం అవుతోంది.
తాప్సీని ‘రశ్మి రాకెట్‘ ట్రైలర్లో చూసిన కొందరు ‘మగాడిలా ఉన్నావ్‘ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆమెది ‘మర్దో వాలీ బాడీ‘ అంటూ వెటకారాలు మొదలెట్టారు. అయితే, ఇలాంటి ట్రోలింగ్స్ కొత్తేం కానీ తాప్సీ… అదే విషయం ఇంటర్వ్యూలో ప్రస్తావించినప్పుడు, ‘‘నాకు అవ్వి కాంప్లిమెంట్స్’’ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. తన శరీరం మగాళ్ల బాడీలా ఉందని నెటిజన్స్ అనటం తాప్సీని పెద్దగా ఇబ్బందేం పెట్టలేకపోయింది. తాను కష్టపడి చెమటోడ్చి వ్యాయామాలు చేసి అథ్లెట్ లుక్ సంపాదించానని ఆమె చెప్పింది. ఇప్పుడు జనాలు తనని ‘మగాడి‘వంటూ పేర్కొనటం, కితాబేనంటోంది!
పలుమార్లు కంగనాతో ఆన్లైన్ జగడాలకు దిగిన తాప్సీ ఆ మధ్య ఐటీ రైడ్స్ కారణంగా, అనురాగ్ కశ్యప్ మూలంగా కూడా ట్రోల్ అయింది. అయితే, తాప్సీకి ఎప్పటికప్పుడు ఈ సొషల్ మీడియా రచ్చంతా, ఫ్రీ పబ్లిసిటీగా మారుతుండటమే, ఇక్కడ కొసమెరుపు!