వంగవీటి రాధాకృష్ణ , కొడాలి నాని పై పోటీ చేస్తారని ఊదరకోట్టిన సోషల్ మీడియా .వంగవీటి రాధాకృష్ణ వైసీపి లోకి రానున్నారా…కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ గుడివాడ లో ప్రత్యేక సమావేశం….రాజకీయ భవిష్యత్తు పై చర్చించిన కొడాలి నాని, వంగవీటి.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఒప్పించి మీత్రుడు వంగవీటి రాధాకృష్ణ ను వైసీపి పార్టీ లోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం మంత్రి కొడాలి నాని చేస్తారా..ఈరోజు జరిగిన కొడాలి ,వంగవీటి వీరిద్దరి కలయిక అవుననే విధంగా ఉంది….
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ రాజకీయాలలొ తెలుగుదేశం పార్టీ తరుపున మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ రానున్నారని , ఇప్పటి వరకు మిత్రులు గా ఉన్న వంగవీటి , కొడాలి ప్రత్యర్థులగా మారనున్నారని అనేక ఆశక్తిరమైన వార్తాలు మీడియా లో రావడం తో గుడివాడ నియోజకవర్గం తో పాటు రాష్ట్రంలో రాజకీయ వర్గాలలో కొంత చర్చకు దారితీసింది.
ఈ వార్త కధనం పై ఇరువురు నేతలు మౌనంగా ఉండటంతో నిజమేని అందురూ నమ్మారు .దానికి తెరదించుతూ ఈరోజు గుడివాడ లో ఇరువురు నాయకులు ఓకే వేదిక మీదకు రావడం తో గందరగోళానికి తెరపడింది. వైసీపి నాయకులు పాలేటి చంటి మనవడి మొదటి పుట్టిన రోజు వేడుకలలో కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ ఇరువురు ఆత్మీయంగా పలకరిచుకున్నారు. రాజకీయ పార్టీలు వేరైనా ఇద్దరం మంచి మిత్రులమని ప్రజలకు , రాజకీయ వర్గాలకు సంకేతం పంపారు…వీరిద్దరి కలయిక చూసిన వారు త్వరలో వంగవీటి రాధాకృష్ణ వైసీపి లోకి రానున్నారని చర్చ జరుగుతుంది.