అన్నదాతలు విజయం సాధించారు. ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాల్లోనూ వెనక్కి తగ్గని మోదీ సర్కార్.. అన్నదాతల ఆగ్రహానికి తలొగ్గింది.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. నూతన సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో కిసాన్ ఉద్యమాలు హోరెత్తించాయి. ముఖ్యంగా ఇవాళ పంజాబ్, హర్యానా రైతులు ప్రధాని ప్రకటనతో ఇక ఆనందంలో తేలారు. సీఎం కేసీఆర్ నేపథ్యంలోనూ తెలంగాణ సర్కార్ కూడా రైతు చట్టాలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే.
గురుపూరబ్ సందర్భంగా ప్రధాని మోదీ ఇవాళ ఉదయమే కీలక ప్రకటన చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రైతు చట్టాల రద్దుపై తీర్మానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దేవ్ దీపావళి, ప్రకాశ్ పర్వ్ సందర్భంగా గ్రీటింగ్స్ చెబుతున్నట్లు మోదీ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. కార్తార్పూర్ కారిడార్ను ఒకటిన్నర ఏళ్ల తర్వాత రీఓపెన్ చేయడం సంతోషకరమని ఆయన అన్నారు. గురునానక్ దేశ సేవ బోధనలను ఆయన గుర్తు చేశారు. 2014లో తాను ప్రధాని అయిన తర్వాత రైతులకు ప్రాముఖ్యత కల్పించానని, వారి సంక్షేమం.. అభివృద్ధి కోసం పని చూశామన్నారు.