తెలంగాణ రైతాంగం పండించే యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం గట్టిగా చెప్పినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ‘మేం ఎంతో ఆశతో వచ్చాం. కానీ కేంద్రం నిరాశ పర్చింది.
కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించాం. ఎంత కొనుగోలు చేస్తుందో టార్గెట్ చెప్పమన్నాం. ఏడాదికోసారి టార్గెట్ ఇవ్వలేమని గోయల్ చెప్పారు’ అని తెలిపారు. కాగా ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రి పియూష్ గోయల్తో TS మంత్రులు భేటీ అయిన సంగతి తెలిసిందే.