ప్రస్తుతం Tollywood లో ఒకవైపు లెజండరీ నటులు అనారోగ్యంతో మరణిస్తుంటే మరోవైపు హీరోలు పలు సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. తేజూ ప్రమాదం తర్వాత అడివి శేష్, హీరో రామ్, చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ ఇలా పలువురు స్టార్స్ ఆసుపత్రులలో అడ్మిట్ అయ్యారు. ఇక ఇప్పుడు సూపర్స్టార్ మహేశ్ బాబు సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నారనే వార్త ఆందోళన కలిగిస్తుంది.
సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ సమయంలో మహేష్ మోకాలికి మైనర్ గాయం అయినట్టు తెలుస్తుండగా, దీనిపై మహేష్ వైద్యులను సంప్రదించగా.. మోకాలికి సర్జరీ అవసరమని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అమెరికా పయనం కానున్నట్లు టాక్. సర్జరీ అనంతరం మహేష్ బాబు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట.