Home / NATIONAL / రైతులు చనిపోయారా.. మాకు తెలియదే మా దగ్గర రికార్డులే లేవు

రైతులు చనిపోయారా.. మాకు తెలియదే మా దగ్గర రికార్డులే లేవు

వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనోద్యమంలో రైతులు చనిపోయిన విషయం తమకు తెలియదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది. రైతుల మరణాలపై తమ దగ్గర రికార్డులేమీ లేవని తెలిపింది. కాబట్టి వారికి ఆర్థిక సాయం చేసే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. ‘ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఏమైనా ఆర్థిక సాయం అందజేస్తారా’ అని లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రైతు ఉద్యమంలో దాదాపు ఏడువందల మంది చనిపోయారని, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని రైతు సంఘాలు కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ ఉద్యమాన్ని విరమించుకోవాలంటే కేంద్రం నెరవేర్చాల్సిన డిమాండ్లలో ఈ అంశం ప్రధానంగా ఉన్నది.

రైతులపై దాడుల సమాచారం లేదు..
నిరసనోద్యమంలో రైతులు చనిపోయిన విషయం తమకు తెలియదని లోక్‌సభ సాక్షిగా అసత్య ప్రవచనాలను వల్లెవేసిన కేంద్రప్రభుత్వం.. రాజ్యసభలోనూ అదే ధోరణి కొనసాగించింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులపై దాడులు జరిగినట్టుగానీ, ఆ దాడుల్లో అన్నదాతలు గాయపడినట్టుగానీ తమవద్ద ఎలాంటి సమాచారంలేదని వెల్లడించింది. నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికలో కూడా ఇలాంటి కేసుల ప్రస్తావన లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ బుధవారం రాజ్యసభకు తెలిపారు. ఎన్సీఆర్బీ ‘క్రైమ్స్‌ ఇన్‌ ఇండియా 2020’ నివేదిక ప్రకారం.. ఆ ఏడాది 5,78,641 మంది వివిధ కేసుల్లో గాయాలపాలైయినట్టు పేర్కొన్నారు. అయితే, నిరసన చేస్తున్న రైతులపై దాడులు జరిగినట్టు నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదన్నారు. ఆందోళనలు చేస్తున్న రైతులపై ప్రభుత్వం లేదా కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడినట్టు వచ్చిన వార్తలను ఉటంకిస్తూ ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి పైవిధంగా స్పందించారు.

ఈ ఫొటో 26 జనవరి 2021 నాటిది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాడు రైతులు ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా ఓ రైతు మరణించారు. అయితే పోలీసులు కాల్పులు జరుపడంతోనే అన్నదాత ప్రాణాలు కోల్పోయాడని అప్పట్లో రైతు సంఘాలు ఆరోపించాయి. కానీ పోలీసులు మాత్రం ట్రాక్టర్‌ బోల్తాపడటంతోనే రైతు మరణించారని చెప్పారు. కానీ ఇప్పుడు కేంద్రమంత్రి రైతులు చనిపోయినట్టు తెలియదన్నారు. అంటే నాడు పోలీసులు చెప్పింది తప్పా.. మంత్రి చెప్పింది తప్పా.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat