తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో… సీనియర్ హీరో.. మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ‘టైగర్ నాగేశ్వరావు’ చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఇందులో రవితేజ సోదరి పాత్రలో రేణు కనిపించనున్నారని తాజా సమాచారం. ఇప్పటికే ఆ పాత్ర గురించి రేణుతో చర్చలు కూడా జరిపారట. త్వరలో దీనిపై క్లారిటీ రానుందని తెలుస్తోంది. తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా ‘జానీ’. కాగా, ఫిబ్రవరి 11న ‘ఖిలాడి’ చిత్రంతో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ప్రస్తుతం ‘ధమాకా’, ‘రామారావు ఆన్డ్యూటీ’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.