Home / SLIDER / 10 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లి చేసిన దేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం టీఆర్ఎస్-MLA Kp

10 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లి చేసిన దేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం టీఆర్ఎస్-MLA Kp

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధికి చెందిన 16 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు బహదూర్ పల్లి గ్రామంలోని వార్డు కార్యాలయ ఆవరణలో  ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ గారు, మైనంపల్లి హన్మంతరావు గారు ముఖ్య అతిథులుగా హాజరై పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయాలని సంక్షేమ పథకాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ర్టంలో 10 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లి చేసిన దేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం టీఆర్ఎస్ అని అన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పేదలకు వరమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్ యాదవ్, ఎమ్మార్వో భూపాల్, పిఎసిఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, స్థానిక వైస్ చైర్మన్ టి.పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, భరత్ కుమార్, ఎల్లుగారి సత్యనారాయణ, నిజాంపేట్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, టీఆర్ఎస్ నాయకులు మురళి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, మధన్ రావు, మల్లేష్, వెంకటేశ్, సగ్గిడి శ్రీనివాస్, కొమురయ్య యాదవ్, సత్యనారాయణ యాదవ్, లక్ష్మీ నర్సయ్య, శ్యామ్, పద్మారావు, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, శివా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat