టీమిండియా మాజీ కెప్టెన్… పరుగుల యంత్రం విరాట్ కోహ్లి శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్ మ్యాచ్ తో తన వందో టెస్టులో సెంచరీ కొట్టలేడు., 45 పరుగుల వద్ద ఎంబుల్డెనియా బౌలింగ్ అవుటవుతాడని మ్యాచ్ కు ముందే ఓ ట్వీట్ వైరల్ అయ్యింది.
శ్రుతి అనే పేరుతో ఉన్న యూజర్ ట్వీట్లో ఈ పోస్టు ఉంది. దీనికి వీరేంద్ర సెహ్వాగ్ వావ్ అంటూ స్పందించాడు. అయితే ఇది ఫ్యాబ్రికేటెడ్ ట్వీట్లా ఉందని పలువురు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం సరిగ్గానే అంచనా వేశారని కామెంట్లు చేస్తున్నారు.