హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరలపై ప్రముఖ నటుడు ప్రభాస్ స్పందించారు. రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముందే ఏపీలో టికెట్ల ధరల పెంపుపై జీవో వస్తే సంతోషిస్తానని చెప్పారు. ఈనెల 11న రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు ఏపీలో టికెట్ల ఇష్యూపై ప్రభాస్ను అడగ్గా ఆయన స్పందించారు. సీఎం జగన్తో మీటింగ్ నిర్ణయాలు తన నిర్మాతలకే తెలుసన్నారు. టికెట్ ధరలను పెంచుతూ తక్షణమే జీవో ఇష్యూ చేస్తే బాగుంటుందని ప్రభాస్ అభిప్రాయపడ్డారు. ఏపీలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లంతా రాధేశ్యామ్ మూవీ వైపే చూస్తున్నారని చెప్పారు.
రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్కు జోడీగా పూజా హెగ్డే నటించింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో జ్యోతిష్యుడిగా కనిపించనున్నారు. 1970 కాలంలో ఇటలీ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా ఈ సినిమాలను తీర్చిదిద్దారు. ట్రైలర్లో చూపించిన విధంగా షిప్ ఎపిసోడ్ రాధేశ్యామ్ సినిమాకే హైలైట్గా నిలిచే అవకాశముంది.