జనసేన అధినేత,పవర్ స్టార్..సీనియర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వేదికగా ఏపీ రాజకీయాలు నడుస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు మొదలు మంత్రుల వరకు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై,,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. దీంతో పవన్ కు ఘాటుగా రిప్లై ఇచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఆయన మాట్లాడుతూ ‘పవన్ కేవలం సినిమాల్లోనే హీరో.. పొలిటికల్ గా నేను రియల్ హీరో.
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం తప్ప పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోరా? టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావ్? ఎందుకు విడిపోయావ్? బీజేపీతో పొత్తు వల్ల రాష్ట్రానికి ఏం సాధించగలిగారో ప్రజలకు చెప్పాలి. రాష్ట్రానికి టూరిస్టుగా వచ్చే పవన్ కళ్యాణ్ కు ఏం తెలుసు?’ అని ఆయన ప్రశ్నించారు.