పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీగండం ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో దీనిపై ఏ క్షణమైనా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇమ్రాన్ కు షాకిస్తూ 24 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు.
దీంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అవిశ్వాసం నెగ్గాలంటే 172 సీట్లు కావాలి. కానీ ఇమ్రాన్ ప్రభుత్వానికి ప్రస్తుతం 155 సీట్లు మాత్రమే ఉన్నాయి.