తెలంగాణ రాష్ట్ర రాజధాని పరిధిలో హైదరాబాద్ జంట నగరాల్లోని సికింద్రాబాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయిగూడలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే.. ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్న 11 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
ప్రమాదం నుంచి ఒక కార్మికుడు మాత్రమే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. మంటలు వ్యాపించిన వెంటనే స్థానికులు ఫైర్ ఇంజన్కు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
ఈక్రమంలో అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద మృతులకు సంతాపం తెలిపారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను కేసీఆర్ ప్రకటించారు. వలస కార్మికుల మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ను ముఖ్యమంత్రి ఆదేశించారు.