ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై పలు విషయాలను సీఎం ప్రస్తావించారు. తెలంగాణలో యాసంగి సీజన్లో పండిన మొత్తం ధాన్యాన్ని సేకరించాలని.. అలా చేయకపోతే కనీస మద్దతు ధరకు అర్థం ఉండదని సీఎం పేర్కొన్నారు. దీంతో జాతీయ ఆహార భద్రత లక్ష్యానికి విఘాతం కలుగుతుందని చెప్పారు.
ధాన్యం పూర్తిగా సేకరించకపోతే రాష్ట్ర రైతులు, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుందని లేఖలో ప్రధాని మోడీకి కేసీఆర్ వివరించారు. ‘‘ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేసే బాధ్యత కేంద్రానిదే. ధాన్యం సేకరణకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి. పంజాబ్, హర్యానా మాదిరిగా తెలంగాణలోనూ ధాన్యం కొనుగోలు చేయాలి. ఈ అంశంపై చర్చించేందకు అన్ని రాష్ట్రాల సీఎంలు, నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలి’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.