పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రతిపక్ష పార్టీ ప్రవేశ పెట్టనున్న అవిశ్వాస తీర్మానంపై రేపు గురువారం రోజు జరగనున్న చర్చలో భాగంగా ఓటింగ్ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనకుండా ఇమ్రాన్ ఖాన్ తన పార్టీకి చెందిన ఎంపీలకు విప్ జారీ చేశాడు.
ఓటింగ్ కు దూరంగా ఉండాలని..అవిశ్వాస తీర్మానం జరగనున్న క్రమంలో పార్లమెంట్ సమావేశాలకు ఎవరు హాజరు కావద్దు అని హుకుం జారీ చేశాడు ఇమ్రాన్ ఖాన్. అయితే అవిశ్వాస తీర్మానంపై ఎంపిక చేసిన పార్టీ ఎంపీలు మాత్రమే మాట్లాడుతారు.. ఈ సూచనలు ఆదేశాలు ఉల్లంఘించిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా నడుచుకున్న వేటు తప్పదని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించాడు.