Home / SLIDER / విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలి

విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలి

విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని గ్రౌండ్ లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు క్రీడలలో పాల్గొనడం వలన మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో దృడంగా తయారు అవుతారని లభిస్తుందచెప్పారు. తమ పిల్లలను ఈ ఉచిత శిభిరానికి పంపించడం ద్వారా ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

GHMC పరిధిలోని మొత్తం 6 జోన్ లలో 854 సమ్మర్ కోచింగ్ క్యాంప్ లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ సమ్మర్ క్యాంప్ లో అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, కరాటే, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీ బాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ వంటి తదితర 44 రకాల క్రీడలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, నెల రోజులపాటు ఈ సమ్మర్ క్యాంప్ కొనసాగుతుందని తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున విద్యార్ధులకు శిక్షణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటుందని, క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తుందని చెప్పారు.

GHMC పరిధిలో కోట్లాది రూపాయల వ్యయంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్మాణం క్రీడా మైదానాల అభివృద్ధి వంటి పనులను చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. రాష్ట్రం నుండి అనేకమంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలలో తమ ప్రతిభను చాటి ఎంతో గుర్తింపును సాధించారని పేర్కొన్నారు. వారిని స్పూర్తిగా తీసుకొని క్రీడలలో ప్రతిభ ను చాటే విధంగా కృషి చేయాలని తద్వారా మీకు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, GHMC జాయింట్ కమిషనర్ యాదయ్య, కార్పొరేటర్ దీపిక, స్పోర్ట్స్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat