Home / MOVIES / మహేష్ అభిమానులకు కిక్ ఇచ్చే వార్త

మహేష్ అభిమానులకు కిక్ ఇచ్చే వార్త

దాదాపు రెండున్న‌రేళ్ళ త‌ర్వాత స‌ర్కారు వారి’ పాట‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు.ఈ నెల మే12న విడులైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ క‌లెక్ష‌న్ల‌ను తెచ్చుకుంటుంది. మ‌హేష్ కెరీర్‌లో ఈ చిత్రం బిగెస్ట్ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు రిజీన‌ల్ చిత్రాల‌లో వేగంగా 100కోట్ల షేర్‌ను సాధించిన హీరోగా మ‌హేష్ రికార్డు సృష్టించాడు.

ప్ర‌స్తుతం మ‌హేష్,మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాకు సిద్ధ‌మౌవుతున్నాడు. అత‌డు, ఖలేజా వంటి క‌ల్ట్ క్లాసిక్స్ త‌రువాత వీళ్ళ‌కాంబోలో మూడో చిత్రం తెర‌కెక్క‌నుండ‌టంతో ప్రేక్ష‌కులు ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఇదివ‌ర‌కే పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభంకానుంది. అయితే ఈ సినిమా టైటిల్‌పై టాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. ఈ చిత్రానికి ‘పార్థూ’, ‘అర్జునుడు’ అనే టైటిల్స్‌ను ప‌రిశీల‌న‌లో ఉంచిన‌ట్లు తెలుస్తుంది. ఈ చిత్రం యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుందని టాక్. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. హారికా హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై చిన‌బాబు నిర్మిస్తున్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat