తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నటసార్వభౌమునికి భారతరత్న ఇవ్వాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి మల్లారెడ్డి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ.. ఎన్టీఆర్కు భారతరత్న కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాటం చేస్తారన్నారు. సీఎం కేసీఆర్.. ఎన్టీఆర్ బాటలో నడుస్తున్నారని చెప్పారు.ఎన్టీఆర్కి భారత రత్న ఇవ్వాల్సిందేనని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టమని చెప్పారు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ ఉంటారని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎన్టీఆర్లానే సీఎం కేసీఆర్ కూడా మంచి పరిపాలన అందిస్తున్నారని వెల్లడించారు.