తెలంగాణలోని సర్కారు బడుల్లో ఉన్న విద్యార్థులకు వారానికి 3 సార్లు కోడి గుడ్లను తప్పనిసరిగా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. వేడిగా ఉన్న ఆహారమే వడ్డించాలని.. ముందుగా హెడ్మాస్టర్, టీచర్లు రుచి చూడాలని సూచించారు. పోషక విలువల గల భోజనం పెట్టాలన్నారు. మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు విద్యార్థులకు ఇచ్చే కోడిగుడ్ల సేకరణ ధరను ప్రభుత్వం రూ.4 నుంచి రూ.5కు పెంచింది.
