Home / POLITICS / సంజయ్‌లాంటి నేతల వల్లే దేశంలో అశాంతి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

సంజయ్‌లాంటి నేతల వల్లే దేశంలో అశాంతి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటనల వెనుక టీఆర్‌ఎస్‌ ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలు సంజయ్‌ అజ్ఞానానికి నిదర్శనమని చెప్పారు.

దేశ రక్షణ కోసం సేవ చేయాలనుకునే యువతను బీజేపీ అవమానిస్తోందని విమర్శించారు. గతంలో రైతన్నలు, ఇప్పుడు సైనికులను నిర్లక్ష్యంగా చూడటం హేయమైన చర్య అని ఆక్షేపించారు. బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ జరుగుతున్న ఆందోళనల వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. అక్కడ కూడా టీఆర్‌ఎస్‌ ఉందా? అని బండి సంజయ్‌ను ప్రశాంత్‌రెడ్డి నిలదీశారు. సంజయ్‌ లాంటి నేతల వల్లే దేశంలో అశాంతి, అభద్రత నెలకొన్నాయని ఆయన ఆరోపించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat