ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో ఉన్న బేయర్ పత్తి విత్తన, జెన్యు పరిశోధన కేంద్రాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వస్త్ర పరిశ్రమకు అది మూలాధారహని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పండే నాలుగు రకాల పత్తిపంటల్లో 90 శాతం గాస్పియం హిర్సూటం రకానికి చెందిందే ఉంటుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ప్రపంచంలో అత్యధికంగా భారత్లో సుమారు 6.2 మిలియన్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. ఇండియాతోపాటు చైనా, అమెరికాలలో పత్తి ఎక్కువగా సాగవుతుందని చెప్పారు.