ఏపీ ఉమ్మడి రాష్ట్ర అప్పటి మాజీ దివంగత ముఖ్యమంత్రి,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామరావు అఖరి కుమార్తె అయిన ఉమామహేశ్వరి ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విధితమే. అయితే ఆమె మృతి గురించి ఓ మిస్టరీ అంటూ బాంబు పేల్చారు నందమూరి లక్ష్మీపార్వతి.
ఎన్టీఆర్ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధగా ఉన్నాయని ఉమామహేశ్వరి మృతికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మానసికంగా హరికృష్ణను ఎన్నో ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. అందుకే ఈ రోజుకీ కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో మాట్లాడరని.. ఈమె మరణం కూడా మిస్టరీగా మారిందన్నారు. ఈ విషయంలో సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు.