Breaking News
Home / SLIDER / విరాట్ కోహ్లీ తాజాగా  మరో ఘనత

విరాట్ కోహ్లీ తాజాగా  మరో ఘనత

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌.. మాజీ కెప్టెన్.. సీనియర్ ఆటగాడు కింగ్‌ విరాట్ కోహ్లీ తాజాగా  మరో ఘనత సాధించాడు. ఇందులో భాగంగా క్రికెట్ లో  రెండు టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్‌లోనే నిష్క్రమించినప్పటికీ.. విరాట్‌ కోహ్లీ మ్రాతం టాప్‌ స్కోరర్‌గా టోర్నీని ముగించాడు. ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 98.66 సగటుతో 296 పరుగులు చేశాడు.

ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. ఇందులో పాకిస్థాన్‌పై నమోదుచేసిన 82 (నాటౌట్‌) కూడా ఉన్నాయి.2014లో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌లో కూడా విరాట్‌ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 106.33 సగటుతో 319 పరుగులు చేశారు.

ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్‌లలో కలిపి అత్యధిక రన్స్‌ చేసిన ఆటగాడు కూడా కోహ్లీయే కావడం విశేషం. మొత్తం 27 మ్యాచ్‌ల్లో 1,141 పరుగులు చేశాడు. 81.50 సగటు నమోదుచేశాడు. ఇందులో 14 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆ ఘనత శ్రీలంక మాజీ క్రికెటర్‌ మహేళ జయవర్ధనే పేరుతో ఉన్నది.

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri