ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మాజీ మంత్రి ..ఎమ్మెల్సీ నారా లోకేష్ పాదయాత్రకు డీజీపీ దేశంలో ఎక్కడా లేని కండిషన్లు పెట్టడం తాడేపల్లి కుట్రే అని టీడీపీ నేత బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… పాదయాత్రకి ఎంత మంది వస్తారో, ఎన్ని కార్లు వస్తాయో వాటి వివరాలు ఇమ్మంటే ఇవ్వడం సాధ్యమా అని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్ర కు జగన్ అవినీతి పాలనతో ఇబ్బందీ పడి కడుపు మండిన ప్రజలు ఎంత మంది వస్తారో అంచనా వేయడం సాధ్యమా అని అన్నారు.
ముఖ్యమంత్రి,అధికార వైసీపీ నేత జగన్మోహాన్ రెడ్డి ,వైఎస్ షర్మిల పాదయాత్రకు ఏ విధంగా పోలీసులు అనుమతి ఇచ్చారో నారా లోకేష్ పాదయాత్రకు అలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాజకీయ పార్టీలకు పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లే హక్కు రాజ్యాగమే ఇచ్చిందని డీజీపీ గుర్తు పెట్టుకోవాలన్నారు. లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించాలని చూస్తే తీవ్ర పరిణామాలను చూస్తారని బోండా ఉమా హెచ్చరించారు.