సహజంగా మనకు కొద్దిగా జ్వరం రాగానే ఏదో అయిపోతుందని భయపడతాము.. దీంతో శరీరమంతటా కాలిపోతుందని ఏకమ్గా పిడికెడు మందు గోలీలు వేసుకుంటాం. అయితే ఇలా చేయడం కంటే జ్వరం వచ్చింది అని అలా వదిలేయడమే మంచిదంటున్నారు నిపుణులు. మనకు వచ్చిన జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది, పైగా అంటువ్యాధులేమైనా ఉంటే వాటినీ తగ్గించేస్తుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే తేలికపాటి జ్వరం రోగనిరోధక శక్తిని పెంచటంలో దోహదం చేస్తుంది. శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. తేలికపాటి జ్వరం ఒంటికి మంచిదేలే! అని కెనడాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఆల్బర్ట్ ఇమ్యునాలజిస్ట్ ప్రొఫెసర్ డానియెల్ బరెడా అంటున్నారు. ఆయన నేతృత్వంలోని బృందం.. చేపలకు బ్యాక్టీరియాను సంక్రమింపజేసి, చికిత్స చేయకుండా వదిలేసింది.
తర్వాత పరీక్షిస్తే మిత జ్వరం ఇన్ఫెక్షన్లతో వేగంగా పోరాడగలదని తేలింది. వాపు అయిన చోట కణజాలాన్ని సరిచేయగల రోగనిరోధక శక్తి పెంపొందుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మితమైన జ్వరం స్వీయ పరిషారమైనదని, సహజంగా వచ్చే జ్వరం శరీరాన్ని ప్రేరేపించగలదని నిర్ధారణ అయ్యిందని తెలిపారు. ఏడు రోజుల్లో చేపలను ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడేయటానికి జ్వరం సహాయపడిందని వెల్లడించారు.