తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో చుక్కెదురైంది.గతేడాదిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలో ఉన్న పలు దళిత సంఘాలు కన్నెర్ర చేశాయి. ఈ మేరకు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.
దళితుల మ నోభావాలను దెబ్బతీశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్లోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో బంగారు సాయిలు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్వింద్పై కేసు నమోదైంది.అర్వింద్ హైదరాబాద్లోని మాదన్నపేట పోలీస్స్టేషన్ పరిధిలో వ్యాఖ్యలు చేయడంతో, నిజామాబాద్ పోలీసులు కేసును ఇక్కడికి బదిలీ చేశారు. మాదన్నపేట పోలీసులు విచారణ చేయకుండా ఉండేందుకు ఈ కేసుపై అర్విం ద్ స్టే తెచ్చుకున్నాడు.