Home / SLIDER / ఒక్క అవకాశం ఇవ్వండి 5 వేల ఇండ్లు కట్టిస్తా

ఒక్క అవకాశం ఇవ్వండి 5 వేల ఇండ్లు కట్టిస్తా

ఈటల రాజేందర్‌ను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన ఏం చేసిండో మీకందరికీ తెలుసని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గానికి నాలుగు వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తే ఒక్కటి కూడా కట్టలేదని విమర్శించారు. ఈ సారి తనకు అవకాశం కల్పిస్తే ఐదువేల డబుల్‌ బెడ్రూం ఇండ్లు పేదలకు కట్టిస్తానని హామీ ఇచ్చారు.

శుక్రవారం ఆయన హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో ఉదయం, ఉప్పలపల్లి, భీంపల్లిలో సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయాచోట్ల గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. నామినేషన్‌ దాఖలు చేసే ముందు ఉద్యమ గడ్డగా పేరున్న ఉప్పల్‌ ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చానని తెలిపారు.

ఈ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌కు ఓటేస్తే ఆయన్ను కలువడానికి రూ.10 వేలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ‘నాకు ఓటేసి గెలిపిస్తే మీ మధ్యే ఉంటా. రూపాయి ఖర్చు లేకుండ నన్ను కలుసుకోవచ్చు. ఏ కష్టం వచ్చినా ఆదుకుంట. కండ్లలో పెట్టి చూసు కుంటా’నని గెల్లు మాట ఇచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat