మీరు చదివింది నిజమే.. ఫోటో కొట్టు వంద పట్టు.. ఈ విధానం నవ్యాంధ్రలోని విజయవాడలో తీసుకొచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అసలు విషయానికొస్తే విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మారుస్తామని సీఎస్ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం ఇప్పటికే భూసారం తగ్గుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే విజయవాడ నగర వాసులంతా చైతన్యవంతులై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆయన కోరారు. ఎవరైన సరే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అమ్మినా కానీ కొన్నా కానీ వాడినా కానీ ఫోటో తీసి తనకు పంపితే రూ. వంద ఇస్తామని చెప్పారు. వచ్చే అక్టోబర్ నెల 2వ తారీఖు నుంచి ప్లాస్టిక్ పై పూర్తిగా నిషేధం విధిస్తామని ఆయన తెలిపారు.
