తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్వయంగా ఆరాతీస్తున్నారు. ఎల్లంపల్లినుంచి మేడిగడ్డవరకు 104 కిలోమీటర్ల గోదావరి తీరం మంథని నియోజకవర్గంలోనే ఉన్నది. గోదావరి జలాలు కన్నెపల్లి పంపుహౌస్ద్వారా అన్నారం బరాజ్కు చేరుకుని ఎదురెక్కుతున్న పరిస్థితిపై ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్కు ఫోన్చేసి వివరాలు తెలుసుకున్నారు. గోదావరి ఎదురెక్కుతూ గ్రామాలను తాకుతుంటే ఆయా గ్రామాల్లోని ప్రజల, రైతుల స్పందన …
Read More »కాళేశ్వరంలో జలకళ
దిగువనుంచి వస్తున్న జలాలతో గోదారి ఎదురెక్కుతున్నది. మేడిగడ్డ, అన్నారం బరాజ్లతోపాటు.. మానేరులోనూ పెద్దఎత్తున నీరు పోగుపడుతుండటంతో క్రమేణా విస్తరిస్తున్నది. ప్రాణహితనుంచి వస్తున్న వరదనీటిని సాగునీటిశాఖ ఇంజినీర్లు మేడిగడ్డ, అన్నారం బరాజ్లలో నిల్వచేస్తున్నారు. మేడిగడ్డలో మొత్తం అన్ని గేట్లను మూసివేయడంతో శుక్రవారానికి సుమారు 4.50 టీఎంసీల నీరు చేరింది. ఫలితంగా ఇక్కడ గోదావరిలో బ్యాక్వాటర్ 20 కిలోమీటర్ల వరకు విస్తరించింది. అటు అన్నారం బరాజ్లో నీటినిల్వ 2.50 టీఎంసీలు దాటింది. దీంతో …
Read More »మోదీ సర్కారుకు సుప్రీం షాక్.
కేంద్ర ప్రభుత్వం 800ల పెన్షన్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేవలం 200 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తుందన్న అబద్ధాలపై సుప్రీంకోర్టు సీరియస్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 200 రూపాయల పెన్షన్ నిరాధార పౌరులకు ఏమూలకు సరిపోతుందని ఏ రకంగా ఆసర కాగలదని ప్రశ్నించింది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి హాయిగా తిరుగుతుంటే వారిని ఎందుకు అరెస్టు చేయలేదని అలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడే …
Read More »రైతు కుటుంబానికి అండగా వైఎస్ జగన్..ఇది ఒక సంచలన నిర్ణయం
అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా నిన్న శుక్రవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ మేరకు రాష్ట్ర ప్రజలు అందరు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్లోనే శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.దీనిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.’రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబానికి 7 లక్షల చెల్లించే బీమా పథకం దేశంలోని ఏ రాష్ట్రంలో …
Read More »ఈనెల 18, 19 తేదీల్లో తెలంగాణ శాసనసభ సమావేశాలు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న గురువారం ప్రగతిభవన్లో పురపాలక ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో పురపాలక ఎన్నికలను కొత్త చట్టంతోనే నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18, 19 తేదీల్లో శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై కొత్త పురపాలక బిల్లును ఆమోదించనుంది. గతంలో ఈనెల 15 లేదా 16 తేదీల్లో ఎన్నికల ప్రకటన ఇచ్చి ఈ నెలాఖరుకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లను చేసిన ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం తర్వాతే …
Read More »ఏపీ మంత్రిని కలిసిన చిరు..!
కాంగ్రెస్ మాజీ ఎంపీ ,టాలీవుడు సీనియర్ స్టార్ హీరో కొణిదెల చిరంజీవి ఈ రోజు శుక్రవారం నవ్యాంధ్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును కలిశారు.ఈ క్రమంలో మంత్రి కన్నబాబు సోదరుడు సురేష్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దీంతో సురేష్ మరణంతో కురసాల ఇంట విషాదం నెలకొంది.దీనికారణంగానే మంత్రి కన్నబాబు బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరుకాలేకపోయారు. నేడు సురేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సోదర …
Read More »నిను వీడని నీడను నేనే హిట్టా. ఫట్టా..!
టైటిల్ : నిను వీడని నీడను నేనే జానర్ : థ్రిల్లర్ తారాగణం : సందీప్ కిషన్, అన్యా సింగ్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ సంగీతం : తమన్ దర్శకత్వం : కార్తీక్ రాజు నిర్మాత : సందీప్ కిషన్, సుప్రియ కంచర్ల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ హీరోగా సక్సెస్ వేటలో వెనుకపడుతున్నాడు. కెరీర్లో ఒక్క వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేకపోవటంతో తన కెరీర్ను …
Read More »అభాగ్యుడికి మంత్రి సింగిరెడ్డి భరోసా..!
తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం నరసింగపల్లి గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వారికి చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బాధితుడ్ని పరామర్శించారు. జిల్లా ఏరియా ఆస్పత్రి డాక్టర్ తో మంత్రి మెరుగైన చికిత్స ఇవ్వాలని సూచించారు. బాధితుడ్ని పరామర్శించిన వారిలో వనపర్తి మాజీ మున్సిపల్ …
Read More »నిరుద్యోగ యువతకు టీసర్కారు గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురును తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా రాష్ట్రంలో గురుకులాల్లో ఉన్న పలు పోస్టుల భర్తీకి సర్కారు పచ్చ జెండా ఊపింది. దీంతో రాష్ట్రంలో బీసీ గురుకులాల్లో ఉన్న 1698ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతులు జారీ చేసింది. గురుకులాల్లో ఉన్న 1071 టీజీటీ,119పీఈటీతో పాటుగా ముప్పై ఆరు ప్రిన్సిపల్ సహా పలు ఇతర పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ …
Read More »ఇది ఫిష్ మార్కెట్టా…! టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం
టీడీపీ సభ్యులపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం శుక్రవారం నాడు అసహనాన్ని వ్యక్తం చేశారు. అధికార పక్ష సభ్యులు మాట్లాడుతున్న సమయంలో విపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గొడవ చేయడంతో సభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకొంది. ఈ సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు.శుక్రవారం నాడు వడ్డీ రాయితీ లేని అప్పుల విషయమై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం …
Read More »