తెలంగాణ రాష్ట్రంలోని జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. ప్రత్యేక సమావేశ౦ నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారిని నియమించనున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11.00 గంటలకు నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ వార్డు మెంబర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక …
Read More »టీఆర్ఎస్ లోకి వలసలు
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని ఆర్మూరు మండలానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లుగా వారు తెలిపారు
Read More »మంత్రి కేటీఆర్ సీఎం కావాలని…!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరుతూ మంచిర్యాలకు చెందిన టీఆర్ఎస్ యూత్ విభాగం నాయకులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకు న్నారు. శుక్రవారం అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి తిరుమలకు కాలినడక ప్రారంభించారు. కేటీఆర్ను సీఎంగా చూడాలన్నదే తమ ఆకాంక్ష అని, అందుకోసమే స్వామికి మొక్కులు చెల్లించేందుకు వెళ్లినట్టు వారు పేర్కొన్నారు. తిరుమల వెళ్లినవారిలో టీఆర్ఎస్ యూత్ …
Read More »నవతరం నేత.. నవ్యతకు బాట “కేటీఆర్”
పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతికరంగాల్లో ఆయనది ఒక నవశకం. తెలంగాణ ఆధునిక విప్లవ ప్రగతి ఫలాలను అందరికి అందిస్తున్నారు. సుధీర్ఘ రాజకీయ, పాలనానుభవం కలిగిన ఎంతోమంది పాలకుల వల్ల కానిది కేవలం ఆరేండ్ల కాలంలోనే చేసి చూపించారు. యావత్ దేశానికే ఒక మార్గదర్శిగా నిలిచిన యువనేత తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్. రాష్ట్ర పారిశ్రామికరంగ అభివృద్ధికి నిత్యం కృషిచేస్తూ టీఎస్- ఐపాస్, వి-పాస్, వంటి వినూత్న పథకాల …
Read More »పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు : మంత్రి కేటీఆర్
పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని శ్రీరామ్నగర్లో మంత్రి కేటీఆర్ డయాగ్నోస్టిక్ మినీ హబ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రెండేండ్ల కింద నారాయణగూడలో ఐపీఎం ప్రారంభించుకున్నాము. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రక్త పరీక్షలు, మూత్ర …
Read More »తెలంగాణలో రేషన్ పంపిణీలో సరికొత్త విధానం
కరోనా వ్యాప్తి తగ్గేంతవరకు OTP, ఐరిస్ల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చౌక ధరల దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రాన్ని వినియోగించడం ద్వారా వైరస్ ప్రబలే అవకాశముందన్న.. హైకోర్టు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 1నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది ఈ విషయమై మార్గదర్శకాలు జారీచేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ కలెక్టర్లకు సూచించారు.
Read More »రాజకీయ వారసత్వం కాదు.. తెలంగాణ రాజకీయాలకు జవసత్వం ..!!
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఎంత ముఖ్యమో.. రాష్ట్రంలో స్వయం పాలన ను నిలబెట్టడానికి, అభివృద్ధి పథాన నడిపించడానికి , పటిష్టమైన నాయకత్వం అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలోంచే వర్తమాన తెలంగాణలో భవిష్యత్తు నాయకత్వం రూపుదిద్దుకుంటున్నది. ఆ క్రమంలోనే, యువమంత్రి కేటీఆర్ ను సిఎం కెసిఆర్ కొడుకుగానే కాకుండా, రేపటి తరానికి నాయకుడిగా రూపుదిద్దుకుంటున్న పరిణామ క్రమాన్ని మనం అర్థం చేసుకోవాల్సి వున్నది. కేటీఆర్ నేడు ఈ స్థాయికి చేరుకోవడమనేది యేదో …
Read More »సింగరేణిలో కొలువుల జాతర
తెలంగాణలోని సింగరేణిలో కొలువుల జాతర మొదలయింది. మొదటివిడుతగా 372 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదలయింది. సింగరేణిలో 651 పోస్టులను మార్చిలోపల భర్తీచేస్తామని సీఎండీ ఎన్ శ్రీధర్ ప్రకటించిన రెండు వారాల్లోనే మొదటివిడుత భర్తీకి నోటిఫికేషన్ రావడం గమనార్హం. మిగతా పోస్టులకు దశలవారీగా నోటిఫికేషన్లను విడుదలచేస్తామని సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. తాజా నోటిఫికేషన్లో 7 క్యాటగిరీల్లో 372 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో 305 పోస్టులను లోకల్.. అంటే …
Read More »తెలంగాణలో పది పరీక్షల నిర్వాహణపై క్లారీటీ
తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా? అనే అంశంపై విద్యార్థుల్లో సందేహం ఉంది. అయితే మే 17వ తేదీ నుంచి పది పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించి, …
Read More »తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచించారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 214 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,92,835కి చేరింది. 1586 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 3,781 యాక్టివ్ కేసులున్నాయి.. చికిత్స నుంచి కోలుకుని 2,86,898 మంది డిశ్చార్జ్ అయ్యారని …
Read More »