Classic Layout

కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు

తెలంగాణలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCHRD)లో రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు పథకాల అమలు పై  రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ టి హరీష్ …

Read More »

సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పార్క్ వుడ్ విల్లాకు చెందిన ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు మంగళవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో గోదావరి మంచినీటి పైపు లైన్లు, భూగర్భడ్రైనేజీ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత …

Read More »

మరో లక్ష కోట్ల అప్పు యోచనలో కేంద్రం!

ఇప్పటికే మన దేశం లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరించడంతో ఆ అప్పులు తారాస్థాయికి చేరాయి. ఇప్పడు కేంద్రం మరో లక్ష కోట్ల రూపాయల మేర అప్పు చేసే యోచనలో ఉన్నదని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఈ లక్ష కోట్ల అప్పు కోసం మార్కెట్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలిపాయి. …

Read More »

కరీంనగర్ లో జూన్ 2న ప్యారచుట్ విన్యాసాలు..

మానేరు తీరంలో ప్యారాచూట్ విన్యాసాలుఅందుబాటులోకిరానున్నాయి. మూడు రోజులుగా కరీంనగర్ మానేరుజలాశయం మీదా ప్రయోగాత్మకంగా ఏయిర్ షో నిర్వహించారు. ప్యారాచూట్ విన్యాసాలకు ఈప్రాంతం అనువుగా ఉందా… లేదా అని పరిశీలించిన పైలెట్ సుకుమార్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. మానేరు అందాలతో పాటు తీగలవంతెన, కరీంనగర్ పరిసరాలు ఆకాశం నుంచి తిలకించే విధంగా ఏయిర్ షోలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల …

Read More »

మంత్రి కేటీఆర్ తో సీఎం జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహాన్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో  సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే  తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ముఖ్యమంత్రి జగన్  భేటీ  అయ్యారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ‘ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో గొప్ప సమావేశం జరిగింది’ …

Read More »

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో లూలు గ్రూపు రూ.500 కోట్ల పెట్టుబడి

దావోస్ లో జరుగుతున్న  ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) సమావేశాల్లో తొలి రోజే తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావుతో నిన్న సోమవారం వివిధ కంపెనీల ప్రతినిధులు సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు లూలు గ్రూపు అధిపతి యూసుఫ్‌ …

Read More »

ఉస్మానియా దవాఖానపై త్వరగా నివేదిక ఇవ్వండి -మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ మహానగరంలోని ఉస్మానియా దవాఖానలో పురాతన కట్టడానికి ఇబ్బంది కలుగకుండా, అదనపు భవనాల నిర్మాణానికి సంబంధించిన సమగ్ర నివేదికను త్వరగా ఇవ్వాలని చీఫ్‌ ఇంజినీర్ల కమిటీని మంత్రుల బృందం ఆదేశించింది. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసారి శ్రీనివాస్‌యాదవ్‌తో కూడిన బృందం సోమవారం ఎంసీహెచ్చార్డీలో చీఫ్‌ ఇంజినీర్ల కమిటీతో భేటీ అయ్యింది. సమావేశానికి స్థానిక ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ హాజరయ్యారు. ఈ …

Read More »

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక ఏకగ్రీవం

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. బండ ప్రకాష్‌ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రవిచంద్రను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రాజ్యసభ స్థానం గెలుపొందేందుకు పూర్తిస్థాయిలో మెజార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉంది. దీంతో మిగతా పార్టీలు అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ నేపథ్యంలో వద్దిరాజు రవిచంద్ర ఒక్కరే నామినేషన్‌ వేయడంతో …

Read More »

కేంద్రంలో హిట్లర్‌ కంటే దారుణంగా బీజేపీ పాలన: మమత

కేంద్రంలోని బీజేపీ పాలన హిట్లర్‌, ముస్సోలిని కంటే దారుణంగా ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌, వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో రాష్ట్రంలోని పాలనా వ్యవహారాల్లో బీజేపీ ప్రభుత్వం తలదూరుస్తోందని ఆరోపించారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థలను కూల్చివేస్తోందన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా దర్యాప్తు సంస్థలు పనిచేసేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆమె కోరారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat