టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. బండ ప్రకాష్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా రవిచంద్రను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజ్యసభ స్థానం గెలుపొందేందుకు పూర్తిస్థాయిలో మెజార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఉంది.
దీంతో మిగతా పార్టీలు అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ నేపథ్యంలో వద్దిరాజు రవిచంద్ర ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం ఆయనకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు వద్దిరాజు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.