ఇప్పటికే మన దేశం లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరించడంతో ఆ అప్పులు తారాస్థాయికి చేరాయి.
ఇప్పడు కేంద్రం మరో లక్ష కోట్ల రూపాయల మేర అప్పు చేసే యోచనలో ఉన్నదని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఈ లక్ష కోట్ల అప్పు కోసం మార్కెట్కు వెళ్లే అవకాశం ఉందని తెలిపాయి.
ఇందుకు తాజాగా పెట్రోల్, డీజిల్పై ఎక్పైజ్ సుంకం తగ్గించిన కారణంగా.. రాబడి తగ్గే అవకాశం ఉందని, దీన్ని పూడ్చుకునేందుకు అదనపు మార్కెట్ రుణానికి వెళ్లే ఆలోచన కేంద్రం చేయవచ్చని అధికారి ఒకరు పేర్కొన్నారు.