ఏపీలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అధిష్టానం లక్ష మెజార్టీ అనుకున్నప్పటికీ.. అనుకున్నదానికంటే తక్కువగానే మెజార్టీ వచ్చింది. మొత్తమ్మీద నోటా, బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో వైసీపీ మెజార్టీ తగ్గిందని చెప్పుకోవచ్చు. మొదటి రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకూ భారీగానే ఆధిక్యంలోనే కొనసాగిన వైసీపీ అభ్యర్థి చివరికి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సురేష్పై 90,550 …
Read More »అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ పార్టీ హావా
పశ్చిమ బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ పార్టీ దుమ్మురేపుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్లుతోంది. అధికార తృణమూల్ పార్టీకి బీజేపీ ఇవ్వలేకపోయింది. కూచ్బిహార్ జిల్లాలోని దిన్హటా స్థానంలో టీఎంసీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ స్థానమైన దిన్హటాలో ఈసారి టీఎంసీ తరపున ఉదయన్ గుహ పోటీలో నిలిచారు. అయితే బీజేపీ అభ్యర్తి అశోక్ మండల్పై .. ఉదయన్ సుమారు లక్షన్నర ఓట్ల మెజారిటీతో …
Read More »భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవం
భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లను కోల్పోయింది. మండి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ప్రతిభా సింగ్.. బీజేపీ అభ్యర్థి కుషాల్ ఠాకూర్పై గెలుపొందారు. దాదాపు పది వేల ఓట్ల మెజారిటీతో బ్రిగేడియర్ కుషాల్ ఓటమి పాలయ్యారు. ఇక ఫతేపూర్, ఆర్కీ, జుబ్బల్ అసెంబ్లీ స్థానాలను …
Read More »హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతం: శశాంక్ గోయల్
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్గోయల్ తెలిపారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్ నమోదైందని, తుది నివేదికల తర్వాత మరింత పెరిగే అవకాశమున్నదని చెప్పారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమలాపూర్లో 224, 225 పోలింగ్కేంద్రాల్లో సమయం దాటిన తర్వాత కూడా ఓటర్లు బారులు తీరారని చెప్పారు. పోలిం గ్ ముగిశాక పోలింగ్ ఏజెంట్ల …
Read More »హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 86.33 % పోలింగ్ నమోదు
హుజూరాబాద్ నియోజకవర్గానికి శనివారం జరిగిన ఉపఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఓటు హక్కును వినియోగించుకొన్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో 84.39 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఈసారి 86.33 % (కడపటి వార్తలు అందిన సమాచారం మేరకు) నమోదైంది. ఉదయం నుంచి పోలింగ్ గంటగంటకూ పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం సమయంలో బాగా పెరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకొన్నారు. …
Read More »హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లు చైతన్యం చాటారు
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లు చైతన్యం చాటారని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. హుజూరాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. నాలుగు నెలలుగా పార్టీ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ గారి మార్గదర్శకం, హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో గొప్ప విజయం సాధించబొతున్నామని …
Read More »పారిస్ లో మంత్రి కేటీఆర్ Busy Busy
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బుధవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్కు బయలుదేరివెళ్లారు. ఈ నెల 29వ తేదీన ఫ్రాన్స్ ఎగువ సభలో (సెనేట్) జరిగే ‘యాంబిషన్ ఇండియా-2021’ సదస్సులో పాల్గొంటారు. ‘గ్రోత్-డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కొవిడ్ ఎరా (కొవిడ్ తర్వాత భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలు) అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో సమావేశమవుతారు. …
Read More »మంత్రి హారీష్ రావు సవాల్ – పరారైన బీజేపీ
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఓట్లు దండుకోవాలని చూసిన బీజేపీ అసలు స్వరూపాన్ని టీఆర్ఎస్ బయట పెట్టింది. కమలం పార్టీకి హుజూరాబాద్ ప్రజలు ఓటు ఎందుకెయ్యాలో చెప్పాలని ఎన్నిసార్లు డిమాండ్చేసినా ముఖం చాటేసింది. మంత్రి హరీశ్రావు ఎన్ని సవాళ్లు విసిరినా సమాధానం చెప్పకుండా ఆ పార్టీ నాయకులు పరారయ్యారు. విచిత్రం ఏమిటంటే.. ఏ ఒక్క సవాల్కు కాషాయం పార్టీ సమాధానం చెప్పలేకపోయింది. దీంతో కమలం పార్టీ నాయకుల …
Read More »వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు అందిన దళితబంధు పథకం ఫలాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు దళితబంధు పథకం ఫలాలు అందాయి. బుధవారం పండుగ వాతావరణంలో యూనిట్ల పంపిణీని చేశారు. కూలీనాలీ చేసుకొంటూ జీవనం సాగించిన నిరుపేద దళిత కుటుంబాల వారు ఇప్పుడు ఓనర్లుగా మారి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో గతంలోనే జమ చేశారు. తాజాగా వీరిలో ముగ్గురికి …
Read More »గెల్లు శీనుకు 25వేల మెజార్టీ ఖాయం
‘హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమైపోయింది. ఆయన 25 వేల ఓట్ల మెజారిటీ సాధించబోతున్నారు. బుధవారం ఉదయమే మనకు అందిన తాజా సర్వేల్లో ఈ విషయం తేటతెల్లమైంది’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఏ సర్వే చూసినా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్తున్నదని, చివరికి బీజేపీ వాళ్ల సర్వేలో కూడా ఇదే తేలడంతో కొంత మంది ఆ పార్టీ నాయకులు ఫోన్లు నేలకేసి కొట్టుకుంటున్నారని తెలిపారు. …
Read More »