తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి ఒక పంచాయితీ కార్యదర్శి ఖచ్చితంగా ఉండే విధంగా కొత్తగా 9,200 మంది పంచాయితీ కార్యదర్శులను నియమించనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియ ప్రారంభించి, రెండు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న పెద్దా అనే తేడాలేకుండా ప్రతీ గ్రామానికి ఒక పంచాయితీ కార్యదర్శి ఉండాలని, పల్లెసీమలను ప్రగతి …
Read More »హరితహారం కార్యక్రమంపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష..!!
తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి నరేగా నిధులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసే పనుల నుంచి మొదలుకుని వాటిని కాపాడే వరకు ప్రతీ దశలోనూ మానవ శ్రమే ప్రధానం కాబట్టి, వ్యవసాయ కూలీలతో ఆ పనులు చేపించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సీఎం చెప్పారు. దీనికి సంబంధించి డిపిఆర్ రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి ప్రగతి …
Read More »దేశంలోనే తొలిసారి.. యాదాద్రికి అరుదైన గౌరవం..సీఎం కేసీఆర్ హర్షం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని దేవాలయాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెలంగాణ తిరుపతిగా పేరు పొందిన యాదాద్రి ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. యాదగిరి లక్ష్మీనర్సింహ స్వామి కొలువుదీరిన ఈ ఆలయానికి ISO సర్టిఫికెట్ లభించింది.యాదాద్రి పుణ్యక్షేత్రం ఐఎస్ఓ సర్టిఫికెట్ సాధించినందుకు ఆలయ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఐటిడిఎ వైస్ చైర్మన్ జి.కిషన్ రావు, ఇవో ఎన్.గీత, హెచ్.వై.ఎం. ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ …
Read More »పౌరులందరికీ ఉచిత కంటిపరీక్షలు..సీఎం కేసీఆర్ కీలక రివ్యూ
రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15 మద్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గజ్వేల్ నియోజకవర్గంలో తానే స్వయంగా కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కూడా ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరనున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో …
Read More »మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తికి 60 రోజుల డెడ్ లైన్..సీఎం కేసీఆర్
రాబోయే 60 నుంచి 80 రోజుల్లో మిషన్ భగీరథ ప్రాజెక్టు వందకు వందశాతం పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పనులు పూర్తయిన చోట ప్రారంభంలో వచ్చే చిన్నచిన్న సమస్యలను (బాలారిష్టాలు -టీతింగ్ ప్రాబ్లమ్స్) ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోవాలని సూచించారు. పనుల్లో వేగం, నాణ్యత పెంచడానికి, మిషన్ భగీరథను మరింత సమర్థవంతంగా, సమన్వయంతో నిర్వహించేందుకు ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖను పునర్వ్యవస్థీకరించాలని సిఎం నిర్ణయించారు. మిషన్ …
Read More »బాబు స్వార్థానికి ఎందుకు సీఎం కేసీఆర్ మద్దతివ్వడం లేదంటే..
తాము చేస్తే సంసారం…ఎదుటోళ్లు చేస్తే.. అన్న సామెతకు సరిగ్గా సరిపోయే తెలుగుదేశం నేతలు ప్రచారానికి పెట్టింది పేరనే సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న సమయంలో ఏనాడూ ఏపీ ప్రయోజనాలు పట్టించుకోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పైపెచ్చు ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అవిశ్వాసం పెడితే కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు తగదునమ్మా అంటూ అవిశ్వాసం పెట్టి రంకెలు వేస్తున్నాడు. పైగా ఇందులో కి తన వందిమాగదులతో …
Read More »లండన్ లో ఘనంగా “టాక్ బోనాల జాతర”.!
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను ఘనంగానిర్వహించారు.ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 800 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా మరియు ఫస్ట్ సెక్రటరీ అఫ్ ఇండియన్ హైకమిషన్ అనిమా భరద్వాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.స్వదేశం లో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీదుల్లో తొట్టెల …
Read More »రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నిక..టీఆర్ఎస్ ఓటే కీలకం
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మరోమారు తెలంగాణ రాష్ట్రం వైపు దేశం చూపుపడింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎన్నికలో టీఆర్ఎస్ ఓటు కీలకం అవుతుండటం, గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇటీవల డిప్యూటీ చైర్మన్ కురియన్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానం భర్తీ చేసేందుకు ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఓటు కీలకం కానుంది. …
Read More »కేసీఆర్ కిట్ తరహాలో మరో వినూత్న పథకం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ఇప్పటికే రైతు బంధు,రైతు భీమ ,కళ్యాణ లక్ష్మి ,విద్యార్ధులకు సన్నబియ్యం ,వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు.అందులో భాగంగానే కేసీఆర్ కిట్ తరహాలో..గురుకుల విద్యార్థులకు కేసీఆర్ బ్యాగులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ బ్యాగులు చూడటానికి అందంగా , …
Read More »పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపనున్న తెలంగాణ ప్రభుత్వం
పాడి రైతుల జీవితాల్లో వెలుగులు పూయించేందుకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోనుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వ పరంగా చేయూత ఇవ్వడం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపాలి అనేదే ముఖ్యమంత్రి లక్ష్యమని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన పాడి పరిశ్రమ రంగంను తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం ప్రణాళికలు వేస్తున్నారని వివరించారు. …
Read More »