తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ధాన్యం కొంటుంటే.. బీజేపీ నేతలు ధర్నాల పేరుతో డ్రామాలాడుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ధర్నాలు ఇక్కడ కాదు ఢిల్లీలో చేయాలని సూచించారు. తాము వడ్లు కొంటున్నామని, బియ్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6,663 కేంద్రాలను ఏర్పాటు చేసి వానాకాలం పంట ప్రతి గింజను కొంటామని చెప్పారు. యాసంగి పంట మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు.
Read More »రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ
వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సోమవారం ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. రైతుల నిరసనలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు పలుకుతూ నరేంద్ర మోదీ సర్కార్ దోపిడీ విధానాలను అనుసరిస్తోందని మండిపడ్డారు.రైతులు అహింసా మార్గంలో సత్యాగ్రహం సాగిస్తుంటే ఈ దోపిడీ సర్కార్ పట్టించుకోకపోవడంతో ఈరోజు భారత్ బంద్ …
Read More »పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలి
ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్నగర్ జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు విజ్ఞప్తిచేశారు. తాము చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలని కోరారు. కేంద్రమంత్రితో సీఎం కేసీఆర్ శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ సాగునీటి పారుదలకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఏపీ …
Read More »సాయంత్రం కేంద్రమంత్రులను కలవనున్న సీఎం కేసీఆర్
ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని, రాత్రి 7 గంటలకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను సీఎం కేసీఆర్ కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లనున్నారు. గత గురువారం ఢిల్లీలోని వసంత్ విహార్లో తెలంగాణ భవన్కు భూమిపూజ చేసిన సీఎం కేసీఆర్.. …
Read More »కొత్త ఐపీఎస్ ఆఫీసర్లను ఇవ్వండి.. కేంద్ర హోంమంత్రిని కోరిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇవాళ సీఎం కేసీఆర్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వినతులు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల తర్వాత జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగిందని, దాంతో కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీజోన్లు ఏర్పడ్డాయని, దానికి తగినట్లే …
Read More »ఢిల్లీలో బయటపడిన బ్రిటీషర్లు వాడిన సొరంగ ( Tunnel ) మార్గం
దేశ రాజధాని ఢిల్లీలో బ్రిటీషర్లు వాడిన సొరంగ ( Tunnel ) మార్గం ఒకటి బయటపడింది. ఢిల్లీ అసెంబ్లీలో ఆ టన్నెల్ను గుర్తించారు. అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు ఆ టన్నెల్ దారితీసినట్లు భావిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులను తరలించేందుకు ఆ సొరంగాన్ని బ్రిటీషర్లు వాడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోట వద్దకు ఆ సొరంగ మార్గం ఉన్నట్లు గుర్తించారు. దేశాన్ని బ్రిటీషర్లు పాలించిన సమయంలో ఆ మార్గం ద్వారా ఫ్రీడమ్ …
Read More »తెలంగాణ భవన్ భూమిపూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రగతిలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ రధసారథి సీఎం కేసీఆర్ మరో ప్రస్థానానికి నాంది పలికారు. దేశ రాజధాని ఢిల్లీలో .. తెలంగాణ భవన్ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి ఇవాళ శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భూమి పూజలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు ఆ వేడుకకు హాజరయ్యారు. వేద …
Read More »తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గులాబీ జెండా పండుగ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండా పండుగను టీఆర్ఎస్ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించాయి. పల్లెపల్లెనా, వాడవాడనా నేతలు టీఆర్ఎస్ జెండాలను ఎగుర వేసి.. మిఠాయిలు పంచిపెట్టారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జరిగిన వేడుకల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పాల్గొని, టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. 4వ, 23, 24వ వార్డుల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. నల్లగొండలో గుత్తా.. నల్లగొండ జిల్లాలో జరిగిన వేడుకల్లో మాజీ శాసనమండలి చైర్మన్ …
Read More »ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి వేదపండితులతో భూమిపూజ
దాదాపు రెండు దశాబ్ధాల చరిత్ర కలిగిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్త శకాన్ని ఆరంభించనున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని కోసం ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కాసేపటి క్రితం భూదేవతకు పూజలు ప్రారంభించారు. ఢిల్లీలోని వసంత్ విహార్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ స్థలంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేత, …
Read More »జలదృశ్యం నుండి సుజల దృశ్యం..
‘సిపాయిల తిరుగుబాటు విఫలమైందనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం..’ పాట తెలంగాణ ఉద్యమ సమయంలో మార్మోగింది.ఈ పాట నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ రచించారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్దేశం ముందుగానే ప్రజల్లోకి ఒక సంకేతంగా పంపారు. రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందంటూ గులాబీ జెండాను భుజాన పెట్టుకొని ఒక్కడిగా మొదలై కోట్ల జనులను ఏకం చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చిండ్రు …
Read More »