ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో హైదరాబాద్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, వాటిని బీజేపీ పాలిత రాష్ర్టాలకు తరలించుకుపోయేందుకు ఆ పార్టీనేతలు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే భయపడేలా సురక్షితంగా ఉన్న హైదరాబాద్లో విద్వేషపూరిత వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, పార్టీ నేతలు గట్టు రాంచందర్రావు, పట్లోళ్ల కార్తీక్రెడ్డితో …
Read More »24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
హైదరాబాద్ లోని మియాపూర్ డివిజన్ లో జయప్రకాష్ నగర్ కాలనీ నందు 108 డివిజన్ టీ.ఆర్.ఎస్ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ గారి గెలుపును ఆకాంక్షింస్తూ అన్వర్ షరీఫ్ గారి అధ్యక్షతన జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నగరం ప్రథమ స్థానంలో ఉందన్నారు . తెలంగాణ రాష్ట్రం …
Read More »వారికి ఓటుతో బుద్ధి చెప్పండి : మంత్రి కేటీఆర్
అందరి హైదరాబాద్ను కొందరి హైదరాబాద్కు మార్చేందుకు కుట్ర పన్నుతున్నవారికి ఓటుతో బుద్ధి చెప్పాల్సిందిగా మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. నగరంలోని కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్, మూసాపేట్ డివిజన్ల టీఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఆరేళ్లక్రితం ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేసి తెలంగాణ ఇప్పుడు అభివృద్ధిలో …
Read More »ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ రోడ్షో
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్, పురపాలకశాఖ మంత్రి కే.తారకరామారావు రణభేరి మోగించారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నగరంలోని ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తాలో చేపట్టిన రోడ్షోలో మంత్రి పాల్గొన్నారు. బోనాలు, బతుకమ్మలతో మహిళలు తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, స్థానికులకు మంత్రి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నేటి ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి …
Read More »మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్
హైదరాబాద్ మతసామరస్యానికి ప్రతీక. ఏడేండ్లుగా ఇక్కడ ఒక్క మతఘర్షణ లేదు. ఏదో కొన్ని సందర్భాల్లో కొందరు చేతకాని నాయకుల వల్ల అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. కానీ, దేశంలో మననగరం ప్రశాంత జీవనానికి నిలయం. ఉపాధి, పరిశ్రమల రంగానికి పెట్టింది పేరు. ఇటీవల అమెజాన్ సంస్థ 21 వేల కోట్ల అతిపెద్ద పెట్టుబడిని మన నగరంలో పెట్టింది. రాష్ట్రం వచ్చాక రెండు లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది. హైదరాబాద్ను మనం …
Read More »వరదసాయంపై బీజేపీ బురద రాజకీయం
హైదరాబాద్ మహానగరంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు పడ్డాయి. ఒక్కరోజే 30 సెంటీమీటర్లు కూడా పడ్డరోజులున్నాయి. కాలనీలకు కాలనీలే నీళ్లలో ఉన్నాయి. పాపం కొంత మంది ఇండ్లలో బియ్యం, ఉప్పు, పప్పు కూడా తడిచిపోయింది. పిల్లల స్కూళ్ల సర్టిఫికెట్లు కూడా తడిసిపోయినయ్. వాళ్లను చూస్తే నాకు చాలా బాధనిపించింది. కొందరి ఇండ్లలో మంచం మునిగేంత నీళ్లు.. వాళ్ల బాధలు వర్ణనాతీతం. చాలా చోట్ల నిరుపేదలే ఎక్కువమంది ఉన్నారు. వాళ్లను ఆదుకోవడం మన …
Read More »నూటికి నూరుశాతం విజయం మనదే-సీఎం కేసీఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయం తమదేనని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో సీఎం అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం ముగిసింది. భేటీ ప్రారంభంలో ఇటీవల మరణించిన పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి సీఎం నివాళి అర్పించారు. అంతా కాసేపు మౌనం పాటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ …
Read More »గ్రేటర్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు షాక్
తెలంగాణ కాంగ్రెస్కు గుడ్బై చెప్పి బీజేపీలో చేరేందుకు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గోదావరి, అంజిరెడ్డి రెడీ అవుతున్నారు. అంజిరెడ్డి దంపతులకు నిన్న రాత్రి బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. పార్టీలోకి రావాలని ఆహ్వానించింది. దీంతో ఇవాళ సాయంత్రం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. అంజిరెడ్డి ఇంటికి వెళుతున్నారు.
Read More »జీహెచ్ఎంసీలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సర్కిళ్ల వారీగా ఆర్వోలు నోటీసు విడుదల చేశారు. అన్ని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్లు దాఖలు చేయొచ్చు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 21 నామినేషన్ల పరిశీలన. …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో సుశాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మాదాపూర్ లో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు చాలా ముఖ్యమని రోజురోజుకు పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోతుందని కాబట్టి అందరం బాధ్యతగా మొక్కలు నాటి మనం పీల్చుకునే ఆక్సిజన్ ను మనమే …
Read More »