చైనాపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. లక్షల మంది ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్… చైనాలోనే పుట్టింది… ఆ దేశమే ఆ వైరస్ని అంటించిందని చాలా మంది ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక ఇండియన్స్ విషయంలో చైనా చేస్తున్న దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా సరిహద్దుల్లో మన భారత జవాన్లను పొట్టన పెట్టుకున్న చైనాపై భారతీయులు ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన ఫాదర్స్ డే సందర్భంగా… ఈనాడులో వచ్చిన కార్టూన్… …
Read More »కరోనాపై సమరంలో గెలుపు దిశగా
కరోనాతో సమరంలో ప్రపంచం ఓడిపోయిందా? కరోనాపై ఎత్తిన కత్తిని అన్ని దేశాలు ఒక్కొక్కటిగా దించేస్తున్నాయా? కరోనాను కంటిచూపుతో చంపేస్తాం, ఆ వైరస్ను నల్లిని నలిపినట్లు నలిపేస్తాం, కత్తికో కండగా నరికేస్తాం అని బీరాలు పలికిన దేశాలన్నీ ఇప్పుడు ఆ వైరస్తో సహజీవనానికి సిద్ధమవుతున్నాయా? గిర్రున రోజులు తిరుగుతున్నా, క్యాలెండర్లో నెలల షీట్స్ సర్రున చిరిగిపోతున్నా ప్రపంచవ్యాప్తంగా కూడా తగ్గని కరోనా కేసులు ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం చెబుతున్నాయి.. ప్రపంచానికి …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్ -కరోనా చికిత్సకు ఔషధం విడుదల
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్, ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరస్ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్మార్క్ ఫవిపిరవిర్ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫాబిఫ్లూ బ్రాండ్ …
Read More »కరోనా వార్డుల్లోకి వర్షపు నీళ్లు
నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ఆదివారం మహారాష్ట్రలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జల్గావ్ జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీ దవాఖానను వర్షం నీరు ముంచెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన కరోనా వార్డులోకి మోకాలు లోతు వరకు వాన నీరు చేరింది. దీంతో అందులోని కరోనా రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది ఇబ్బందిపడ్డారు. నీరు మరింతగా లోనికి రావడంతో కరోనా రోగులను పై అంతస్తులోని వార్డుకు తరలించారు. …
Read More »అమెరికా తర్వాత భారత్లోనే ‘సీరియస్’!
కొవిడ్ విజృంభణ భారత్లో కొనసాగుతూనే ఉంది. ఏ రోజుకారోజూ అత్యధిక కేసులు నమోదవుతూ ఆందోళనకర స్థాయికి చేరుతోంది. గడచిన 24 గంటల్లో 9987 కేసుల నమోదు ఓ రికార్డు కాగా… 331 మంది మృత్యువాత పడ్డారు. దీనితో దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 7,476కు చేరింది. మొత్తం 2,66,598 కేసులతో అంతర్జాతీయంగా ఐదో స్ధానంలో ఉన్న భారత్… ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్యలో రెండో …
Read More »ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులెక్కువ
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తుంది.దాదాపుగా రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో ఈ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదయ్యాయి. మహరాష్ట్రలో 88,528,తమిళనాడులో 33,229,ఢిల్లీలో 29,943,గుజరాత్ రాష్ట్రంలో 20,545,ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10,947,రాజస్థాన్ లో 10,763,మధ్యప్రదేశ్ 9,638,వెస్ట్ బెంగాల్ 8,613,కర్ణాటక లో 5,760కేసులు నమోదయ్యాయి..
Read More »కేంద్రం సంచలన నిర్ణయం..కరోన కట్టడి కోసం ఆ రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే
దేశవ్యాప్తంగా కొన్ని నగరాలు, పట్టణాల్లో కొవిడ్-19 పరిస్థితి దారుణంగా ఉండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటింటి సర్వే చేపట్టడం, వెంటనే పరీక్షలు నిర్వహించడం, వైరస్ వ్యాప్తి, మరణాలను కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించింది. పది రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో 45 స్థానిక సంస్థలకు ఈ మేరకు దిశానిర్దేశం చేసింది. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్, వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్తో కేంద్ర ఆరోగ్యశాఖ …
Read More »కరోనా కేసుల్లో భారత్ రోజుకో రికార్డు
భారత్ దేశంలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రోజుకో రికార్డును తన సొంతం చేసుకుంటుంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 9,971కేసులు నమోదు అయ్యాయి.గత ఐదు రోజుల్లో నమోదైన కేసులు ఇలా ఉన్నాయి. జూన్ 7న మొత్తం కేసులు 9,971 జూన్ 6న మొత్తం కేసులు 9,887 జూన్ 5న మొత్తం కేసులు 9,851 జూన్ 3న మొత్తం కేసులు …
Read More »ప్రధాని మోదీ కంటే సీఎం కేసీఆర్ భేష్
లాక్డౌన్ మరో రెండు, మూడు వారాలు పొడిగించాలని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారిని పకడ్బందీగా ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని తెలంగాణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. మే 7వ తేదీ తర్వాత తెలంగాణలో లాక్డౌన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కరోనాను పూర్తిస్థాయిలో అంతం చేసేందుకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగించాలా? వద్దా? అని ప్రముఖ న్యూస్ ఛానల్ సర్వే నిర్వహించింది. ఏప్రిల్ 29 నుంచి …
Read More »మద్యం ప్రియులకు శుభవార్త
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను మరో రెండు వారాల పాటు పొడిగించిన విషయం విదితమే. అయితే గ్రీన్ జోన్లలో మద్యం, పాన్ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం, పాన్ షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ రెండో దఫా ఈ …
Read More »