ఏపీ ప్రధాన ప్రతిపక్షపార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత..దెందులూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ప్రభాకర్.. ‘నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది. ఓ షూటర్ నాకు ఫోన్ చేసి.. నన్ను చంపేందుకు పురమాయించారని చెప్పాడు. సొంతంగా గన్మెను పెట్టుకుని పోషించలేను. ఉచితంగా రక్షణ కల్పించండి’ అని కోరారు.
Read More »టీటీడీ సంచలన నిర్ణయం
ఏపీలోని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతిలో ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్స్ పై నిషేధం విధించినట్లు TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ‘తిరుమలలో విద్యుత్ వాహనాల వినియోగం ప్రారంభించాం. త్వరలో RTC ద్వారా 100 విద్యుత్ బస్సులు నడుపుతాం. భవిష్యత్తులో తిరుమలకు విద్యుత్ వాహనాలను మాత్రమే అనుమతించాలనే ఆలోచన చేస్తున్నాం. శ్రీవారి ప్రసాదాలను ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకుండా.. జూట్, పర్యా వరణహితమైన సంచుల్లో …
Read More »బాలీవుడ్ లో కరోనా కలవరం -ఉలిక్కిపడ్డ సినిమా ఇండస్ట్రీ
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా పలువురు నటులు వైరస్ బారిన పడటానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే వేడుకలే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. మే 25న తన 50వ బర్త్ డే వేడుకల్ని యశ్జ్ స్టూడియోలో కరణ్ ఘనంగా చేసుకున్నారు. షారూక్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో కనీసం 50 మంది కరోనా బారిన పడ్డారన్న వార్తలొస్తున్నాయి. షారూక్, కత్రినా, …
Read More »దేశంలో కరోనా కలవరం .. ఇక మాస్కు తప్పనిసరా..?
గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,518 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నిన్న ఒక్కరోజే వైరస్ కారణంగా 9 మంది చనిపోయారు. 2,779 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది.
Read More »క్రికెట్ చరిత్రలోనే రికార్డు
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్లో నేపాల్ జట్టు చెత్త రికార్డు మూటగట్టుకుంది. యూఏఈతో జరిగిన పోరులో నేపాల్ 8 పరుగులకే ఆలౌటై అందరిని విస్మయపరిచింది. 2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరుగనున్న ప్రపంచకప్ కోసం నేపాల్, థాయ్లాండ్, భూటాన్, యూఏఈ, ఖతార్ మధ్య క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా శనివారం యూఏఈతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్కు దిగిన నేపాల్ 8.1 ఓవర్లలో 8 పరుగులకు ఆలౌటైంది. …
Read More »దేశ వ్యాప్తంగా కొత్తగా 4,270 మందికి కరోనా
దేశంలో గడిచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా 4,270 మంది కరోనా బారిన పడ్డట్లు నిర్ధారణ అయింది. 2,619 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 5,24,692కి చేరింది. కాగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 24,052 ఉన్నాయి. నిన్న 3,962 కేసులు నమోదయ్యాయి.
Read More »2022ఏడాదిలో బాక్సాఫీస్ ఆదాయం రూ.12,515కోట్లు
2019లో బాక్సాఫీస్ ఆదాయం రూ. 10,948 కోట్లు నమోదైంది. ఆ తర్వాత కరోనా మహమ్మారి వల్ల ఆదాయం రాకకు అడ్డుపడిన సంగతి విదితమే. అయితే ఈ ఏడాది రూ.12,515 కోట్లకు చేరొచ్చని ఓర్మాక్, గ్రూప్ం సంస్థలు అంచనా వేశాయి. కరోనా తర్వాత 18% థియేటర్లు తెరుచుకోకపోయినా మూవీ లకు ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నాయి. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య రూ.4,002 కోట్ల ఆదాయం లభించిందని తెలిపాయి. ఇందులో తెలుగు సినిమాల …
Read More »100కోట్ల క్లబ్ లో F3
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువదర్శకుడు అనిల్ రావిపూడి దర్శకుడిగా సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్,యువ మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించగా తమన్నా, మెహ్రీన్ వారికి జోడీగా నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం F3. F2కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే భార్య, భర్తల మధ్య ఉండే ఫన్, ఫ్రస్ట్రేషన్ ఆధారంగా తెరకెక్కించిన …
Read More »Red డ్రస్ లో మత్తెక్కిస్తున్న రాశీఖన్నా
మధ్యప్రదేశ్ లోనే ఎక్కువగా శిశుమరణాలు
దేశంలో ఎక్కువగా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే అత్యధిక శిశుమరణాలు సంభవిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఆ రాష్ట్రంలో ప్రతీ వెయ్యి మంది నవజాత శిశువుల్లో 43 మంది మృత్యుఒడిలోకి చేరుకొంటున్నారు. మిజోరంలో అతి తక్కువ శిశుమరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రతి వెయ్యిమంది శిశువులకు ముగ్గురు మరణిస్తున్నారు. మొత్తంగా ఏడాది నిండకుండానే దేశంలో ప్రతి 36 పసికందుల్లో ఒకరు …
Read More »