దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రోజువారీ కేసులు నిన్న 30వేలకు దిగిరాగా.. తాజాగా ఇవాళ 42వేలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 42,625 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 26,668 మంది బాధితులు కోలుకోగా.. మరో వైపు 562 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,17,69,132 కు పెరిగింది. ఇందులో …
Read More »ఉద్యోగం కావాలని ట్వీట్ చేసిన జాతి రత్నాలు “హీరో”
స్క్రీన్ రైటర్గా కెరియర్ స్టార్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. చిన్న చిన్న పాత్రల చేస్తూ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా మారాడు. ఇక రీసెంట్గా జాతి రత్నాలు చిత్రంతో ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. ప్రేక్షకులు, సినీ సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాకి ఫిదా అయ్యారు. అయితే నవీన్ నటుడిగానే కాకుండా మానవతా వాదిగాను నిరూపించుకుంటున్నాడు. కరోనా కారణంగా ఎందరో ఉద్యోగాలు కోల్పోయారు. పొట్టకూటి కోసం బండ్లపై …
Read More »ఒలింపిక్స్ లో భారత్ కు మరో మెడల్
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్లో ఇండియన్ బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్( Lovlina Borgohain ) సంచలనాలకు తెరపడింది. బుధవారం 64-69 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో టర్కీ బాక్సర్ బుసెనాజ్ సూర్మనెలి చేతిలో 0-5తో ఆమె ఓడిపోయింది. మూడు రౌండ్లలోనూ టర్కీ బాక్సర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో ఐదుగురు జడ్జీలు ఏకగ్రీవంగా ఆమెనే విజేతగా తేల్చారు. ఈ ఓటమితో లవ్లీనా బ్రాంజ్ మెడల్తో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ బాక్సింగ్లో ఇండియాకు వచ్చిన …
Read More »తీన్మార్ మల్లన్నకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు
తీన్మార్ మల్లన్నపై ఈ ఏడాది ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. క్రైం నంబర్ 197/2021లో ఐపీసీ సెక్షన్ 387, 504 కింద కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు ఆయనకు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురంలోని ఇంటినంబర్ 2-79కు నోటీసులు పంపించారు. ఈ నోటీసుల ప్రకారం పోలీసుల ముందు హాజరు కాకపోతే సీఆర్పీసీ సెక్షన్ …
Read More »కమెడీయన్ కొడుకు సబ్ కలెక్టర్గా నియామకం
ఏ తండ్రికి అయిన తన కుమారుడు పెరిగి పెద్దయి ప్రయోజకుడు అయితే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయిన తన కొడుకు ఉన్నత స్థితిలో చూడాలని కోరుకుంటారు. తండ్రి కలని కుమారులు నిజం చేస్తే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. కమెడీయన్ కొడుకు సబ్ కలెక్టర్గా నియామకం కావడంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు. తమిళ హీరోలు రజనీకాంత్, కమల్ హసన్, …
Read More »ఆ పాత్రలో అనసూయ
బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరో ఛాలెంజింగ్ రోల్లో నటించబోతోందని తాజాగా వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు ఎయిర్ హోస్టెస్గా నటించనున్నట్టు తెలుస్తోంది. ‘పేపర్ బాయ్’, ‘విటమిన్-షి’ సినిమాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జయశంకర్. ఆయన ఓ ఆంథాలజీ మూవీని తెరకెక్కించనున్నాడు. ఇదీ 6 కథల సమ్మేళనం ఉంటుందట. ప్రతి కథలో ఒక ప్రముఖ నటీనటులు …
Read More »ప్రభాస్తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ స్పెషల్ సాంగ్ చేయబోతోందని న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ పూర్తిచేసిన ప్రభాస్, ప్రస్తుతం ‘సలార్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. హోంబలే …
Read More »CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఫలితాలు ( CBSE results ) విడుదలయ్యాయి. జూలై 30న 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన బోర్డు ఇవాళ 10వ తరగతి ఫలితాలను కూడా వెల్లడించింది. కరోనా మహమ్మారి విస్తృతి కారణంగా CBSE ఈసారి పరీక్షలు నిర్వహించలేదు. విద్యార్థులు గత ఏడాది కాలంగా రాసిన యూనిట్ పరీక్షలు, ప్రాక్టికల్స్, ప్రీ బోర్డు, మిడ్ టర్మ్ పరీక్షల్లో సాధించిన …
Read More »రేపు వాసాలమర్రికి ముఖ్యమంత్రి కేసీఆర్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం పర్యటించనున్నారు. ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మరో 20సార్లు అయినా వాసాలమర్రికి వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రేపు గ్రామాన్ని సందర్శించనున్నారు. ఇంతకు ముందు జూలై 9న గ్రామ పర్యటనకు సిద్ధమైనా.. వాయిదా పడింది. సీఎం గ్రామంలోని దళితవాడలో పర్యటించడంతోపాటు రైతువేదికలో …
Read More »సీఎం చేతుల మీదుగా 57 ఏండ్ల పెన్షన్లు ప్రారంభిస్తాం
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57 ఏండ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, అర్హులైన వాళ్లందరికి పెన్షన్లు అందిస్తామన్నారు. ఈ నిర్ణయంతో కొత్తగా మరో 6,62,000 మందికి ప్రతి నెలా రూ. 2016 వృద్ధాప్య పెన్షన్ అందనున్నదని మంత్రి తెలిపారు.ఈ మేరకు తమ శాఖ అధికారులు …
Read More »